‘విక్రమ్‌’తో దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది హరిచందన్‌

  • March 4, 2022 / 04:30 PM IST

హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో జన్మించి సినిమా రంగం మీదున్న మక్కువతో తన కల సాకారం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు యువ దర్శకుడు హరిచందన్‌. ‘విక్రమ్‌’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందారు. ‘మహావీరన్‌’గా తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడ కూడా చక్కని ఆదరణ దక్కింది. శుక్రవారం హరిచందన్‌ పుట్టినరోజు సందర్భంగా తన జర్నీ గురించి చెప్పుకొచ్చారు.

‘‘చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి. ఏడేళ్ల క్రితం భాష తెలియని చెన్నైలో నా సినిమా జర్నీ ప్రారంభమైంది. అలా సినిమా మీద ప్రేమ పెంచుకుని దర్శకత్వం వహించడానికి కావలసిన మెళకువలు నేర్చుకున్నా. విక్రమ్‌ సినిమాతో దర్శకుడిగా మారాను. ఓ మఽధ్య తరగతి కుర్రాడు తీసిన సినిమా విడుదలైతే చాలు వాళ్లు విజేతలు అని నమ్మి ముందుకెళ్లాను. ఈ క్రమంలో ఎన్నో పోగొట్టుకున్నప్పటికీ తెరపై సినిమా కనిపిస్తే చాలనుకున్నా.

తెలుగు ప్రేక్షకులు నాకు ఆ అనుభూతి అందించారు. ఈ జర్నీలో దర్శకులు తేజ, బాబీ, సంగీత దర్శకుడు కోటి, చంద్రబోస్‌గారు ఎంతో సహకరించారు. ఈ సినిమాను త్వరలో ఓటీటీలో కూడా విడుదల చేయనున్నాం. అయితే ఈ సినిమా కన్నా ముందు జై బాలాజీ క్రియేషన్స్‌ పతాకంపై ఆశిష్‌, వినోద్‌, పార్వతి కీలక పాత్రధారులుగా ‘మిస్టర్‌ ప్రాజెక్ట్‌ హెచ్‌’ సినిమా మొదలుపెట్టా. యాక్షన్‌ డ్రామాగా సాగే ఈ చిత్రం క్లైమాక్స్‌ మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే దీని కన్నా ముందు ‘విక్రమ్‌’ సినిమా విడుదలైంది. ఇప్పుడు శ్రీసాయి వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్‌ పతాకంపై ఓ ప్రముఖ హీరోయిన్‌ కీలక పాత్రలో రవీంద్ర.కె నిర్మాతగా ఓ సినిమా మొదలుకానుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అన్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus