అప్పుడు ఓటీటీలో ‘వి’ విడుదలకు ఓకే చెప్పాం!

  • September 1, 2020 / 12:11 PM IST

ఓటీటీలో ‘వి’ చిత్రాన్ని విడుదల చేసే విషయంలో నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మధ్య పలు తర్జనభర్జనలు జరిగాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ‘వి’ని థియేటర్లలో విడుదల చేయాలని హీరో నాని సహా మోహనకృష్ణ ఇంద్రగంటి పట్టుబట్టారు. దర్శకుడు ఈ సంగతి ఒప్పుకున్నారు. అయితే, ‘దిల్’ రాజు వేసిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేక చివరకు ఓటీటీలో విడుదల చేయడానికి అంగీకరించమని ఆయన తెలిపారు. మార్చి నుండి ‘వి’ చిత్రానికి ఓటీటీ వేదికల నుండి ఆఫర్లు వచ్చాయి. ఓటీటీలో విడుదలకు నాని కూడా మొదట ఒప్పుకోలేదని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ “థియేటర్లలో విడుదల చేయాలని తీసిన సినిమా ‘వి’. ఓటీటీలో విడుదల చేయవద్దని ‘దిల్’ రాజు గారిని నేను, నాని ఐదు నెలలు బతిమాలాం. మా కోసం ఆయన కూడా వెయిట్ చేసి చూసి చూశారు. మార్చి మంత్ ఎండింగ్ నుండి సెప్టెంబర్ వరకు థియేటర్లు ఓపెన్ అవుతాయని వెయిట్ చేశారు. అయినా కాలేదు. ‘ఎప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయో చెబుతావా?” అని దిల్ రాజు గారు ప్రశ్నించారు. అప్పటివరకు వెయిట్ చేస్తానని ఆయన అన్నారు. నా దగ్గర సమాధానం లేదు. ఆయన పరిస్థితి పూర్తిగా వివరించే సరికి ఓటీటీలో విడుదల వద్దని చెప్పలేకపోయాం. సరేనని అంగీకరించాం” అని అన్నారు.

సెప్టెంబర్ 5న అమెజాన్ ఓటీటీలో ‘వి’ విడుదల కానుంది. నాని మొదటిసారి విలన్ రోల్ చేసిన సినిమా ఇది. ఇందులో సుధీర్ బాబు హీరో. నాని కంటే అతడికి కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుందట. సుధీర్ సరసన నివేదా థామస్ నటించగా, కీలక పాత్రలో అదితీరావు హైదరి నటించింది. ఆమె పాత్రను సస్పెన్స్ గా ఉంచాలని ట్రయిలర్ లో చూపించలేదని దర్శకుడు ఇంద్రగంటి అన్నారు.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus