‘దృశ్యం 3’పై దర్శకుడి కామెంట్స్!

  • February 23, 2021 / 01:31 PM IST

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘దృశ్యం 2’ సినిమా ఇటీవల అమెజాన్ లో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజానికి ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ‘దృశ్యం’ సినిమా విడుదలైన ఐదేళ్లలో ఎప్పుడూ కూడా సీక్వెల్ కి సంబంధించి చర్చలు జరగలేదు. కానీ గతేడాది కరోనా విరామం తరువాత దర్శకుడు జీతూ జోసెఫ్..

మోహన్ లాల్ కలిసి ఈ సినిమాను మొదలుపెట్టి వేగంగా పూర్తి చేశారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో.. త్వరలోనే తెలుగు వెర్షన్ ని కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారు. అయితే ‘దృశ్యం 2’ సినిమా చూసిన వాళ్లకు ఈ కథకు కొనసాగింపుగా మూడో సినిమా కూడావస్తుందేమోననే సందేహాలు కలుగుతున్నాయి. ఇదే విషయంపై దర్శకుడు జీతూ జోసెఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రస్తుతానికి తనకు ‘దృశ్యం 3’ తీసే ఆలోచన లేదన్నాడు. కానీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నాడు.

ఏదైనా మంచి పాయింట్ దొరికి ఈ స్టోరీని కంటిన్యూ చేయొచ్చని అనిపిస్తే సినిమా తీస్తానని అన్నాడు. ‘దృశ్యం’ సినిమా విడుదలైనప్పుడు అందరూ దీనికి సీక్వెల్ ఉంటుందా అని అడిగారని.. తాను ఆ ఛాన్స్ లేదని చెప్పానని.. కానీ గతేడాది సీక్వెల్ పై ఆలోచన వచ్చి సినిమా తీశానని చెప్పుకొచ్చాడు. తెలుగులో వెంకటేష్ హీరోగా ‘దృశ్యం 2’ చేస్తున్న విషయాన్ని ఈ దర్శకుడు వెల్లడించాడు. తెలుగులో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం కాబట్టి భారీ విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus