డైరెక్టర్ కి కోపం తెప్పించిన చరణ్ ఫ్యాన్స్!

  • January 25, 2021 / 04:22 PM IST

భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఎలాంటి విషయాన్నైనా గోప్యంగా ఉంచుతుంటారు దర్శకనిర్మాతలు. సినిమాలో ఆసక్తికర అంశాలను బయటకి రానివ్వకుండా థియేటర్ లోనే ప్రేక్షకులను థ్రిల్ చేయాలనుకుంటారు. కానీ ఒక్కోసారి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బయటకి వచ్చేస్తుంటాయి. తాజాగా ‘ఆచార్య’ సినిమాకి సంబంధించిన సెట్ విషయాలు కూడా అలానే బయటకి వచ్చాయి. దానికి కారణం చరణ్ ఫ్యాన్స్ అని తెలుస్తోంది. ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇటీవల కొంతమంది చరణ్ అభిమానులు, వ్యక్తిగత సిబ్బంది, అతడి సన్నిహితులు ‘ఆచార్య’ సెట్ కి వెళ్లి చరణ్ ను కలుసుకున్నారు. వాళ్లతో కాసేపు గడిపిన చరణ్ ఫోటోలు దిగి పంపాడు. అయితే సెట్స్ కి వెళ్లిన ఛాన్స్ ఫ్యాన్స్ అక్కడ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆచార్య’ కోసం వేసిన టెంపుల్ సెట్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆ సెట్ లో సింహ ద్వారాన్ని మాత్రమే ఇప్పటివరకు చూపించారు. అది కూడా చిరంజీవి రిలీజ్ చేసిన వీడియోలో కనిపించింది. అయితే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ వలన టెంపుల్ సెట్ లోని కీలక భాగాలన్నీ బయటకి వచ్చాయి.

ఈ విషయం తెలుసుకున్న కొరటాల ‘ఆచార్య’ సెట్ లో ఫైర్ అయినట్లు తెలుస్తోంది. సెట్ కి సంబంధించిన విషయాలు బయటకి ఎలా వస్తున్నాయంటూ సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇకపై బయటివారిని సెట్ లోకి రానివ్వద్దంటూ గట్టిగా చెప్పారట. ఈ విషయంలో కలుగజేసుకున్న చరణ్.. కొరటాలని కూల్ చేశారట. ఇకపై తనకోసం వచ్చిన వాళ్లని కూడా సెట్ లోకి రానివ్వదని.. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవద్దని చెప్పడంతో కొరటాల శాంతించారట.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus