TNR: మారుతి మంచి మనస్సు.. వాళ్లకు సాయం చేయాలంటూ..?

  • May 13, 2021 / 04:02 PM IST

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కరోనా బారిన పడి హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి, సంపూర్ణేష్, మరి కొందరు సినీ ప్రముఖులు టీఎన్ఆర్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చేయగా తాజాగా దర్శకుడు మారుతి 50వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. టీఎన్ఆర్ భార్య జ్యోతి బ్యాంక్ ఖాతాకు మారుతి ఆర్థిక సాయాన్ని పంపించారు. టీఎన్ఆర్ అకాల మరణం వల్ల ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దర్శకుడు మారుతి టీఎన్ఆర్ కుటుంబానికి అండగా నిలవడంపై నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.

మారుతి తను సహాయం చేయడంతో పాటు తమకు తోచినంత సాయం చేయాలని అభిమానులకు సూచనలు చేశారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా మారుతి పక్కా కమర్షియల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా హీరోయిన్ రాశీఖన్నా నటిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిరోజూ పండగే సినిమా తరువాత మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. వరుస విజయాలతో జోరుమీదున్న మారుతి ఈ సినిమాతో మరో సక్సెస్ సాధిస్తానని అనుకుంటున్నారు. టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ మారుతికి స్టార్ హీరోల సినిమాలకు డైరెక్షన్ చేసే ఛాన్స్ రావడం లేదు. పక్కా కమర్షియల్ సినిమా తరువాతైనా మారుతికి స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus