తన మరణ వార్తను ఖండించిన పి వాసు!

  • January 17, 2018 / 05:14 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ తో చంద్రముఖి అనే సినిమాని తెరకెక్కించిన డైరక్టర్ పి. వాసు ఇక లేరు అనే వార్త నిన్నటి నుంచి కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ఈ డైరక్టర్ తమిళంలోనేకాకుండా తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో అనేక హిట్ చిత్రాలను రూపొందించారు. దీంతో వాసు కి ఏమైందని సినీ ప్రముఖులు కంగారుతో ఆరా తీయడం మొదలెట్టారు. ఈ విషయం స్వయంగా వాసుకి తెలియడంతో.. అయన ఈ వార్తను ఖండించారు. ఓ వీడియో మెసేజ్ ద్వారా తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. “నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ చూడ‌గానే వెంటనే న‌వ్వొచ్చింది. నా అభిమానులు ఎవరూ కూడా ఈ వార్తలపై ఆందోళ‌న చెంద‌వ‌ద్దు.

ఈ రోజు ఆరు కిలోమీటర్ల వరకు నడిచాను. పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నాను. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన వారందరికీ ధన్యవాదాలు.” అంటూ వీడియోలో చెప్పారు. అంతేకాదు ఈ ఏడాదిలో మూడు సినిమాల‌కు తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు వాసు వెల్లడించారు. స్టార్స్ విషయంలో ఇటువంటి నకిలీ వార్తలు గతంలోనూ వ్యాపించిన దాఖలాలు ఉన్నాయి. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నింటినీ నమ్మి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అభిమానులు గుర్తించుకోవాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus