అభిమానులకి రజినీ డబుల్ ట్రీట్..?

  • April 15, 2019 / 07:12 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో ‘దర్బార్’ అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలను నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఇక ఈ చిత్రంలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని గత కొంతకాలంగా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఆ టాక్ నిజమేనని ఈ ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టమవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రజినీ డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. తండ్రీ కొడుకులుగా రజినీ ఈ చిత్రంలో కనిపిస్తాడని సమాచారం. ఓ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా మరో పాత్రలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఓ వ్యక్తిగా రజినీ కనిపిస్తారట. నివేదా థామస్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. అనిరుథ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus