‘సరిలేరు నీకెవ్వరు’ కి దేవి సరిపెడతాడా..?

  • June 1, 2019 / 04:01 PM IST

ఇటీవల విడుదలైన మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం మంచి హిట్టయ్యింది. మహేష్ కెరీర్లో ఇది 25 వ చిత్రం.. అంతేకాదు ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రం కూడా..! తన 25 వ చిత్రానికి మంచి కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు మహేష్. ‘రైతులకు సానుభూతి చూపించడం కాదు వారిని గౌరవించాలని’ అలాగే ‘వీకెండ్ అగ్రికల్చర్’ ను కూడా ఈ చిత్రంలో బాగా చూపించారు.

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. అయితే ఒక్కటే లోటు. అదే.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్.. ఆశించిన సంగీతాన్ని అందించకపోవడం. మంచి ఎమోషనల్ సీన్స్, హీరోయిజాన్ని ఎలేవేటే చేసే సన్నివేశాల్లో దేవి.. సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేకపోయాడు. వినడానికి 2 పాటలు బాగానే ఉన్నాయి. కానీ కమర్షియల్ చిత్రానికి కావాల్సిన మ్యూజిక్ అయితే దేవి ఇవ్వలేదు. ఇదే విషయం పై సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్.. దేవిని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ‘మహేష్ 26’ వ చిత్రమైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవి శ్రీ ని తీసుకోవద్దంటూ ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కి అనేక ట్వీట్లు చేస్తూ రచ్చ చేసారు. కానీ చివరికి దేవి శ్రీ ప్రసాద్ నే తీసుకున్నారు. దీంతో ‘ అయిందేదో… అయ్యింది… ఈసారైనా మంచి మ్యూజిక్ ఇవ్వు’ అంటూ దేవి శ్రీ కి కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ చిత్రనికైనా మంచి మ్యూజిక్ ఇచ్చి తన స్టార్ డం ను దేవి.. ప్రూవ్ చేసుకుంటాడేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus