‘ఇస్మార్ట్ శంకర్’ దెబ్బకు ‘ఆమె’ తట్టుకోలేకపోయింది..!

  • July 25, 2019 / 06:31 AM IST

అమలా పాల్ నటించిన తాజా చిత్రం ‘ఆడై’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఆమె’ పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రం టీజర్ విడుదలైనప్పటి నుండీ అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రం విడుదల ఆపేయాలంటూ చాలామంది మహిళలు నిరసనకు దిగారు. విడుదల రోజు తమిళం, తెలుగులో చాలా చోట్ల మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. అయితే ఇది నిర్మాతకు, ఫైనాన్షియర్లకు మధ్య గొడవల వల్లే క్యాన్సిల్ అయ్యాయని సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులు కోసం నిర్మాతకు ముందే డబ్బులు ఇచ్చినప్పటికీ నిర్మాతకు.. అలాగే ఫైనాన్షియర్లకు బ్యాలెన్స్ క్లియర్ అవ్వకపోవడంతో అసలు సమస్య మొదలైంది.

దీంతో అమలా పాల్ ఈ తీసుకున్న రెమ్యూనరేషన్ అంతా నిర్మాతకు వెనక్కు ఇచ్చేసిందట. అంతేకాదు దాంతో పాటు తన సొంత డబ్బు కూడా చెల్లించి విడుదలకు ఉన్న ఇబ్బందులను క్లియర్ చేసింది. ఈ చిత్రం కోసం అమలా పాల్ చాలా కష్టపడింది. సెకండ్ హాఫ్ అంతా అమల నగ్నంగానే కనిపిస్తుంది. పాత్ర కోసం ఆమె చాలా కష్టపడటమే కాదు.. పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. అంత కష్టపడి సినిమా చేసినా.. డబ్బులు మొత్తం వెనక్కి ఇచ్చేసినా అమల హిట్టందుకోలేకపోయింది. సినిమాకు క్రిటిక్స్ నుండీ మంచి రెస్పాన్స్ వచ్చింది.. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి మాస్ హిట్టు ఉంది కాబట్టి ‘ఆమె’ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇక ‘ఆమె’ టీజర్ కు ప్రశంసలు కురిపించిన సెలబ్రిటీలు కూడా ‘ఆమె’ చిత్రం విడుదలయ్యాక స్పందించలేదు. పాపం అమల డబ్బులు పోయాయి.. సినిమా కూడా పోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus