రాజమౌళి మాసివ్ మల్టీస్టారర్ మూవీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

  • June 9, 2018 / 07:24 AM IST

బాహుబలి చిత్రాల తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాపై అందరి దృష్టి ఉంది. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి రోజుకో గాసిప్ బయటికి వస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్నదమ్ములుగా నటిస్తారని, 1980 నాటి కాలంలో కథ సాగుతుందని, క్రీడల నేపథ్యంలో కథ ఉందని.. రూమర్స్ బయటికి వచ్చాయి. వాటిని చిత్ర బృందం వెంటనే ఖండించింది. కథ ఏంటో, పాత్రలు ఏంటో ఇప్పుడే చెప్పడానికి రాజమౌళి టీమ్ సిద్ధంగా లేదు. అయినా తాజాగా మరో రూమర్ రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. 1995లో వచ్చిన ‘కరణ్ అర్జున్’ అనే హిందీ సినిమాకి ఇది రీమేక్ అని కొన్ని సైట్లు కథనాలను ప్రచురిస్తున్నాయి. రాకేశ్ రోషన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. అదే సినిమాను రాజమౌళి రీమేక్ చేయనున్నారని చెప్పుకుంటున్నారు. దీనిపై చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. “మల్టీస్టారర్ మూవీ విషయంలో ఏ ప్రచారాన్ని నమ్మవద్దు. ఈ సినిమా ఏ చిత్రానికి రీమేక్ కాదు. కొత్త కథతోనే నిర్మితమవుతోంది. విజయేంద్ర ప్రసాద్, రాజమౌలి బృందం కథకి తుది రూపు ఇవ్వడంలోనే బిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను వెల్లడిస్తాం” అని స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus