Ek Mini Katha movie: చిన్న సినిమాతోనే డబుల్ ప్రాఫిట్స్ అందుకున్న ‘యూవీ’ సంస్థ..!

  • May 12, 2021 / 10:02 PM IST

‘గోల్కొండ హైస్కూల్’ ‘తను నేను’ ‘పేపర్ బాయ్’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు సంతోష్ శోభన్. ఆయన హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఏక్ మినీ కథ’. ‘యూవీ క్రియేషన్స్’ వారు ‘యూవీ కాన్సెప్ట్స్’ అనే సెకండ్ బ్యానర్ ను స్థాపించి చిన్న సినిమాలను నిర్మించడానికి రెడీ అయ్యారు. మొదటి ప్రయత్నం గా కార్తీక్ రాపోలు దర్శకత్వంలో ‘ఏక్ మినీ కథ’ ను రూపొందించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభించింది.

నిజానికి ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకుని ఓటిటిలో విడుదల చేయబోతున్నట్టు తాజా సమాచారం. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించనందున వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వారు ఈ మూవీని భారీగా రూ.9.5 కోట్లకు కొనుగోలు చేశారట. కొంచెం అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి అమెజాన్ ఒరిజినల్స్ కింద ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి ప్రమోషన్లతో కలిపి రూ.4 కోట్లు ఖర్చు చేశారట యూవీ వారు. దాంతో రూ.5.5 కోట్ల వరకూ వీరు లాభాలు బాట పట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తున్నట్లు వారు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus