‘లస్ట్ స్టోరీస్’.. లో తెలుగమ్మాయి రచ్చ రచ్చే…!

  • March 29, 2020 / 12:14 PM IST

బాలీవుడ్ లో ఎంతో ఆదరణ పొందిన ‘లస్ట్ స్టోరీస్’ ను తెలుగులో కూడా తీస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో నాలుగు ఎపిసోడ్లుగా తెరకెక్కిస్తున్నారు. తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, సంకల్ప్ రెడ్డి… వంటి ముగ్గురు దర్శకులు కలిసి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో తెలుగమ్మాయి.. అందులోనూ వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా కూడా నటిస్తుండడంతో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు నెలకొన్నాయి…

బాలీవుడ్ లో కియారా అద్వానీ ఓ పాత్ర చేసి ఊపు ఊపేసింది. ఇప్పుడు అలాంటి ఓ పాత్రని ఇక్కడ ఈషా పోషిస్తుంది కాబట్టి భారీ క్రేజ్ నెలకొంది. ఇదిలా ఉండగా… ఇటీవల ఈ వెబ్ సిరీస్ ఆన్ లొకేషన్ ఫోటోలను ఈషా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో ఈమె చాలా హాట్ గా కనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో హాట్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది.

అందుకు తగినట్టుగానే ఈమె హాట్ లుక్స్ తో ఫోటోలు ఉన్నాయి. ఈషా కి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఆఫర్లు ఎక్కువ రావడం లేదు. ఈమె గ్లామర్ సన్నివేశాలు ఎక్కువ చెయ్యదు కాబట్టే దర్శకనిర్మాతలు కూడా ఈమె వైపు మక్కువ చూపరనే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ తో అయినా ఈమె పంజుకుంటుందేమో చూడాలి..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

 

27

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus