వరుసగా సినిమాలు కొనుగోలు… ఈటీవీ ప్లానింగ్‌లో ఈ మార్పేంటో?

  • December 10, 2023 / 03:07 PM IST

ఈటీవీలో కొత్త సినిమా అంటే… ఎప్పుడో సంవత్సరానికి కానీ కనిపించదు అని అంటుంటారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈటీవీ ఛానల్‌ కొత్త సినిమాలేవీ కొనడం లేదు. కొన్న ఆ కొన్ని సినిమాలు కూడా చిన్న సినిమాలే. అయితే ఇప్పుడు ఈటీవీ ఆలోచన మారుతున్నట్లు కనిపిస్తోంది. అలా ఎలా ఎంటారా? ఇటీవల కాంలో ఈటీవీ కొనుగోలు చేస్తున్న సినిమాలే ఆ విషయం చెబుతున్నాయి. ఇటీవల కాలంలో కాస్త పేరున్న సినిమాలు కొంటూ వచ్చిన ఈటీవీ… ఇప్పుడు ఏకంగా ఓ అగ్ర హీరో సినిమా డీల్‌ను దాదాపు పూర్తి చేసింది అని అంటున్నారు.

మామూలుగా టాలీవుడ్‌లో ఓ కొత్త సినిమా టీవీల్లో వస్తోంది అంటే మాటీవీ, జెమినీ టీవీ, జీ తెలుగు పేర్లు వినిపిస్తుంటాయి. కొత్త సినిమా శాటిలైట్ రైట్స్ అంటే ఆ మూడు పేర్లే ఇటీవల కాలం వరకు వినిపించేవి. ఇప్పుడు ఈటీవీ కూడా ఈ రేసులోకి వచ్చిందంటున్నారు. భారీ సినిమాలు కాకపోయినా, కొత్త సినిమాల్ని కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. అందులో భాగంగా ‘బాయ్స్‌ హాస్టల్‌’, ‘మ్యాడ్‌’ లాంటి యూత్‌ఫుల్‌ సినిమాలను కొనుగోలు చేసింది.

‘మ్యాడ్‌’ (MAD) విషయంలో అఫీషియల్‌ ఇన్ఫర్మేషన్‌ లేదు కానీ… సమాచారం అయితే పక్కా అంటున్నారు. అయితే ఈ రెండు సినిమాలను మించి ఓ అగ్ర హీరో సినిమాను తాజాగా కొనుగోలు చేశారని చెబుతున్నారు. అదే వెంకటేశ్‌ – శైలేష్‌ కొలను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సైంధవ్‌’. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో డీల్స్‌ను ఫైనలైజ్‌ చేస్తోందట టీమ్‌. అలా టీవీ టెలీకాస్ట్‌ సంగతిని తేల్చేసిందట.

ఈ టీవీలోనే ఆ సినిమాను టెలీకాస్ట్‌ చేస్తారు అని అంటున్నారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే వెంకటేశ్‌ 75వ సినిమాగా రూపొందుతోంది. వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తొలుత ఈ సినిమాను డిసెంబరు ఆఖరులో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ‘సలార్‌’ సినిమా రిలీజ్‌కు డిసెంబరు 22న విడుదల చేయబోతుండటంతో సంక్రాంతికి సినిమాను తీసుకెళ్తున్ఆరు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus