బాలకృష్ణ, మహేష్ బాబు సినిమాల మధ్య రెండు సార్లు వార్

  • June 20, 2017 / 09:39 AM IST

నట సింహ నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల మధ్య పోటీ ఎప్పుడూ రాలేదు. తొలిసారి ఈ ఏడాది తలపడనున్నారు. ఈ దసరాకు మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’, బాలకృష్ణ మూవీ ‘పైసా వసూల్’ మధ్య వార్ జరుగుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతుండగా, పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న పైసా వసూల్ అదే నెల 29 న విడుదలకానుంది. ఈ యుద్ధంలో విజయం ఎవరికీ వరిస్తుందో… అనే విషయాన్నీ చర్చించుకునే లోపున మరో సారి వీరి మధ్య వార్ జరగబోతోంది. 2018 సంక్రాంతికి వీరిద్దరూ బరిలో దిగడం ఖాయం అయిపోయింది. పైసా వసూల్’ తర్వాత బాలయ్య తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

ఈ చిత్ర షూటింగ్ జులై 10 నుంచి మొదలుకానుంది. రెడ్డిగారు అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమాను ఐదు నెలల్లోనే పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రణాళికల్లో ఉన్నారు. ఇక ‘స్పైడర్’ తర్వాత మహేష్ మూవీ ‘భరత్ అను నేను’ ఇప్పటికే సెట్స్ మీదికి వెళ్లిపోయింది. రేపటి నుంచి మహేష్ ఈ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 11న రిలీజ్ చేయబోతున్నట్లు ముందే ప్రకటించారు. ఈ విధంగా వరుసగా రెండు సార్లు బాలయ్య, మహేష్ మధ్య యుద్ధం జరగబోతోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus