అందుకే ప్రభాస్ 25 ను మైత్రి వారితో చేయబోతున్నాడట..!

  • February 20, 2021 / 05:39 PM IST

రాజమౌళి తరువాత అపజయమెరుగని దర్శకుడు ఎవరంటే తడుముకోకుండా చెప్పే పేరు కొరటాల శివ. ఆయన ఇప్పటి వరకూ చేసిన 4 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లే..! ఆయన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్ చేస్తూనే.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎలిమెంట్స్ ను దట్టిస్తూ ఉంటాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కొరటాల అటు తరువాత అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటివరకూ కొరటాల తెరకెక్కించిన చిత్రాల్లోనే భారీ బడ్జెట్ తో ఆ చిత్రం రూపొందనుందట. ఇదిలా ఉండగా.. అది పూర్తయిన తరువాత కొరటాల ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి. దానికి సమాధానంగా ప్రభాస్ పేరు వినిపిస్తుంది. అవును ప్రభాస్ 25వ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. నిజానికి కొరటాలను దర్శకుడిగా పరిచయం చేసిందే ప్రభాస్ అన్న సంగతి తెలిసిందే. అయితే ‘మిర్చి’ తరువాత వీరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.

‘మిర్చి’ నిర్మాతలతో కొరటాల శివకు మనస్పర్థలు రావడం వల్లనే మళ్ళీ ఈ కాంబోలో సినిమా రాలేదని తెలుస్తుంది. ప్రభాస్ తో కొరటాలకు సినిమా చెయ్యాలని ఉన్నప్పటికీ.. ‘యువి’ వారితో కాకుండా ‘మైత్రి’ వారితో చేస్తానని చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. ‘మైత్రి’ వారికి కూడా ప్రభాస్ ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. అది కొరటాలతోనే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus