చేసిన తప్పును తెలుసుకొని.. సరిదిద్దుకొంటున్న ప్రభాస్

  • September 26, 2019 / 12:38 PM IST

“సాహో” సినిమాకు అంతర్జాతీయ స్థాయి తీసుకురావాలనే ఆరాటంలో ప్రభాస్-వెన్నెల కిషోర్-మురళీ శర్మ తప్ప మరో తెలుగు ఆర్టిస్ట్ అనేవాడు సినిమాలో కనబడకుండాపోయాడు. ఆ కారణంగా హిందీ సర్కిల్ లో సినిమాకి ప్లస్ అయినప్పటికీ.. తెలుగులో మాత్రం సినిమా ఫ్లాప్ అయ్యింది. అందుకు ఒన్నాఫ్ ది రీజన్ సినిమాలో తెలుగు ఆర్టిస్ట్స్ లేకపోవడమే. అందుకే.. తన తదుపరి చిత్రమైన “జాన్” విషయంలో ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకొంటున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా జగపతిబాబును ఫైనల్ చేసుకొన్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మొదటి చిత్రమిదే కావడం విశేషం.

ఇకపోతే.. ప్రభాస్ ప్రస్తుతం ప్యారిస్ లో ఉన్నాడు. రాధాకృష్ణ కూడా “జాన్”కు సంబంధించి కథ-కథనలో చిన్నపాటి మార్పుల్-చేర్పులు చేస్తూ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈమేరకు పూర్తి వివరాలు తెలుస్తాయి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus