గీత గోవిందంపై సంచలన కామెంట్స్ చేసిన కె రాఘవేంద్రరావు!

  • August 28, 2018 / 08:12 AM IST

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన గీత గోవిందం మూవీ ఆగస్టు15 న రిలీజ్ అయి తొలి షో నుంచే మంచి టాక్ అందుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా అత్యంత వేగంగా వందకోట్ల గ్రాస్ అందుకొని రికార్డు సృష్టించింది. కేవలం ఎటువంటి సినిమా నేపథ్యంలేని హీరో మూడో చిత్రానికే వందకోట్ల క్లబ్ లో చేరడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈ సినిమా చూసిన తొలిరోజే అనేకమంది స్టార్ హీరోలు, దర్శకులు అభినందనలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పై దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు  సంచలన కామెంట్స్ చేశారు.

“20 ఏళ్ళ క్రితం అర‌వింద్ నేను క‌ల‌సి “పెళ్లి సంద‌డి” సినిమా తీశాము. మ‌ళ్లీ ఇన్నేళ్లకి “గీత‌ గోవిందం” చిత్రం మా చిత్రాన్ని గుర్తు చేసింది. పరశురామ్ నా “పెళ్లి సంద‌డి” సినిమాని కాపీకొట్టాడు” అని నవ్వుతూ ఆరోపణలు చేశారు.  ఇంకా ఆయన మాట్లాడుతూ “సినిమా దర్శకుడికి నిర్మాత‌ల ద‌గ్గ‌ర నుంచి ఎంతో ఒత్తిడి ఉంటుంది. అవన్నీ పరశురామ్ కి కూడా ఎదురయ్యే ఉంటాయి. ఏమైనా తను ఇలాంటి ఓ మంచి చిత్రం తీసినందుకు సంతోషంగా ఉంది” అని అభినందించారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ మరింత పెరగగా.. పరుశురామ్ దర్శకత్వంలో నటించాలని యువహీరోలు ఆశపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus