Genelia: ‘వల్గర్ ఆంటీ’ ట్రోల్స్ పై హీరోయిన్ రియాక్షన్!

  • September 29, 2021 / 06:05 PM IST

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ లలో ఇలాంటివి మరీ ఎక్కువ. ఇటీవల బాలీవుడ్ కపుల్ నటుడు రితేష్ దేశ్ ముఖ్, నటి జెనీలియాకు అలానే జరిగింది. ఈ ఏడాది హోలీ సందర్భంగా వారి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై చాలా ట్రోలింగ్ జరిగింది. దీనిపై జెనీలియా తాజాగా ఓ షోలో స్పందించింది. నటుడు అర్భాజ్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న డిజిటల్‌ షో ‘పించ్’.

ఈ షో సీజన్ 2కి రితేష్, జెనీలియా జంట అతిథులుగా వచ్చారు. ఈ షో లో సెలబ్రిటీల ట్రోల్ కి సంబంధించిన కామెంట్స్‌ని చదివి .. వారి రెస్పాన్స్‌ అడుగుతూ ఉంటారు. అలానే రితేష్, జెనీలియాలకు ఓ వీడియో చూపించారు. అందులో నటి ప్రీతి జింటాని రితేష్ చేతులపై ముద్దు పెట్టకోగా.. జెనీలియా కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ తరువాత ఇంటికి వెళ్లిన జెనీలియా కోపంతో భర్తను కొడుతున్నట్లు.. ఆయన వద్దు అని వేడుకుంటున్నట్లు ఉన్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరల్ అయింది.

ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.. ”సిగ్గు లేదా, వల్గర్‌ ఆంటీ. ఎప్పుడూ ఓవర్‌ యాక్టింగ్ చేస్తుంటావ్‌. ఇది నీ ముఖానికి సెట్‌ అవ్వదు” అని కామెంట్ పెట్టాడు. దీనిపై స్పందించిన జెనీలియా.. ”అతని ఇంట్లో పరిస్థితులు బాలేనట్లున్నాయి. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్.. మీరు ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను” అంటూ ఘాటుగా స్పందించింది. ఆ తరువాత రితేష్.. పాపులారిటీ ఉన్నవాళ్లకి ఇలాంటి విమర్శలు కామన్ అని వాటి గురించి పట్టించుకోకూడదని అన్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus