అదే జరిగితే చరణ్ ఖాతలో మరో హిట్ చేరినట్లే..!

  • July 1, 2020 / 06:20 PM IST

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. చేసింది నాలుగు సినిమాలే అయినా బెస్ట్ కంటెంట్ మూవీస్ తో టాప్ హిట్స్ అందుకొని స్టార్ డైరెక్టర్ అయ్యారు. 2003లో వచ్చిన మిర్చి మూవీతో మొదలైన ఆయన సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగుతుంది. సామాజిక అంశాలకు కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కించడం…కొరటాల గొప్పతనం. అందుకే కొరటాలను ఏరి కోరి తెచ్చుకున్నారు చిరంజీవి. వీరిద్దరి కాంబినేషన్ లో తెరక్కుతున్న ఆచార్య మూవీ 40% శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంది.

కాగా ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే కొరటాల ఓ భారీ ఆఫర్ కొట్టేశాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ కొరటాలతో ఓ చిత్రం కోసం ఒప్పందం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆచార్య మూవీ తరువాత కొరటాల మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే ఉంటుందట. కొరటాల తన నెక్స్ట్ మూవీ తమకే చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ఓ ఒప్పందం చేసుకోవడంతో పాటు..ఫ్యాన్సీ రెమ్యూనరేషన్..భారీ అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందట.

ఇక ఆ చిత్ర హీరో కూడా రామ్ చరణ్ అనే మాట వినిపిస్తుంది. టాలీవుడ్ లో రామ్ చరణ్ మాత్రమే తన తదుపరి చిత్రం ప్రకటించలేదు. మిగతా స్టార్ హీరోలందరూ ఒకటికి రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ కొరటాలతో, చరణ్ ఫిక్స్ అనే మాట గట్టిగా వినిపిస్తుంది. మరి ఇదే కనుక జరిగితే చరణ్ ఖాతాలో మరో హిట్ చేరినట్లే.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus