మహేష్ బాబును కలిసిన గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ భాయ్

  • December 23, 2016 / 07:28 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే ప్రిన్స్ షూటింగ్ ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా, ఆయన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తుతారు. ఆ ఫ్యాన్స్ జాబితాలో ప్రస్తుతం గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ కూడా చేరారు. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న మూవీ షూటింగ్ గుజరాత్ ముఖ్యపట్టణం అలహాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. ఈ నెల 27 వరకు అక్కడే చిత్రీకరణ చేయనున్నారు. అయితే అహ్మదాబాద్ లో జైడస్ హాస్పిటల్ లో మహేష్ పై సన్నివేశం తీస్తుండగా అక్కడకు గుజరాత్ డిప్యూటీ సిఎం నితిన్ భాయ్ వచ్చారు.

ఆశ్చర్యపోవడం చిత్ర యూనిట్ వంతయింది. ఆయన కాసేపు షూటింగ్ ని చూసి మహేష్ తో కలిసి ఫోటో తీసుకున్నారు. ఈ విషయం స్థానిక మీడియాకు తెలిసి మహేష్ క్రేజ్ గురించి కథనాలు ప్రచురించాయి. దీంతో ఈ వార్త ఇక్కడ కూడా హాట్ టాపిక్ అయింది. ఈనెల 27 వరకు అక్కడే చిత్రీకరణ జరుపుకోనున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఆయన సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రానికి సంభవామి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus