Hebah Patel: తప్పు తెలుసుకున్న హెబ్బా పటేల్.. ఇకపై అలా ఉండదట..!

  • June 24, 2021 / 07:14 PM IST

‘అలా ఎలా?’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ముంబై బ్యూటీ హెబ్బా పటేల్.. ఆ తర్వాత ‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా?’ ‘ఈడో రకం వాడో రకం’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన ‘మిస్టర్’ చిత్రంలో ఈమె నటించి పెద్ద తప్పు చేసింది. ఆ సినిమాలో ఈమెది కీలక పాత్రే కానీ మెయిన్ హీరోయిన్ కాదు. పైగా ఆ సినిమా కూడా ఘోర పరాజయం పాలవ్వడంతో ఈమె ఇమేజ్ అంతా డ్యామేజ్ అయ్యింది.

తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి కూడా ఈమెకు సక్సెస్ అందించలేదు. ఇక గతేడాది ‘భీష్మ’ చిత్రంలో ఈమె నటించింది. ఆ చిత్రంలో ఈమెది చాలా చిన్న పాత్ర. ఇక ఈ ఏడాది వచ్చిన ‘రెడ్’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. కానీ అది కూడా ఈమెకు కలిసి రాలేదు. పైగా ఐటెం గర్ల్ అనే ముద్ర పడిపోయింది. ఈ రెండు సినిమాల్లో నటించి తప్పు చేశానని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది హెబ్బా. కేవలం డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించానని..

కెరీర్ కు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అలోచించి ఉంటే.. ఆ సినిమాలు ఒప్పుకునే దాన్ని కాదు అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ మూవీలో ఆమె ప్రాముఖ్యమైన పాత్ర పోషించినట్లు తెలిపింది. పల్లెటూరి అమ్మాయిగా ఈ చిత్రంలో డీగ్లామరస్ గా హెబ్బా కనిపించబోతుందట. ఈ పాత్ర తనకు సంతృప్తినిచ్చినట్టు కూడా ఆమె తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి కథా బలం ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంటాను అని హెబ్బా చెప్పుకొచ్చింది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus