జోరుమీదున్న కుమారి!

  • July 16, 2016 / 01:46 PM IST

“కుమారి 21F” చిత్రంలో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ గా నటించిన హెబ్బా పటేల్ కు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే.. ఆ సినిమా తర్వాత హెబ్బా నటించిన “ఈడోరకం ఆడోరకం” సినిమా హిట్టయినప్పటికీ.. హెబ్బాకు మాత్రం మైనస్ గా మారింది. ఆ సినిమాలో అమ్మడు చేసిన హాట్ ఎక్స్ పోజింగ్ కారణంగా చాలా పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోయాయి.

అయితే.. వెంటనే తేరుకొని మెగాహీరో వరుణ్ తేజ్ సరసన “మిస్టర్”లో సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకొన్న హెబ్బా.. ఇప్పుడు మరో మెగా హీరోతో రొమాన్స్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా హెబ్బాను సెలక్ట్ చేసుకొన్నారట. కుమారి హెబ్బా కూడా మెగా హీరోయిన్ ముద్ర కోసం రహతహలాడుతున్నట్లుంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus