కుర్రహీరోపై ‘టూ స్టేట్స్’ ఎఫెక్ట్!

  • December 28, 2020 / 06:45 PM IST

బాలీవుడ్ లో సక్సెస్ అందుకున్న ‘టూ స్టేట్స్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. అడివి శేష్ హీరోగా.. రాజశేఖర్ పెద్ద కూతురు శివానీని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రీమేక్ సినిమాను మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది. అప్పటికే సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింది. ఇప్పుడు ఈ సినిమాను ఎలాగైనా పూర్తి చేసి విడుదల చేయాలనేది నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం అడివి శేష్ మరో ఇరవై రోజులు కాల్షీట్లు ఇవ్వాల్సివుంది.

కానీ ప్రస్తుతం శేష్ చాలా బిజీగా ఉన్నాడు. ‘మేజర్’ షూటింగ్ తో పాటు ‘గూఢచారి’ సీక్వెల్ ని లైన్ లో పెట్టాడు. ఇలాంటి సమయంలో ‘టూ స్టేట్స్’ సినిమాకి కాల్షీట్లు ఇవ్వడం కుదరని పని. పైగా అతడికి ఈ సినిమాపై నమ్మకం లేదు. సినిమాను ఆపేద్దామని.. కావాలంటే రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసి మరో సినిమా చేస్తానని నిర్మాతకి మాట ఇచ్చాడట శేష్. కానీ ఇప్పటివరకు రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వలేదు. అలా అని నిర్మాత కోసం మరో సినిమా కూడా చేయలేదు.

‘ టూ స్టేట్స్’ని పూర్తిగా పక్కన పెట్టేసి తన మిగిలిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. దీంతో చిత్ర నిర్మాత లీగల్ గా అడివి శేష్ పై యాక్షన్ తీసుకోవాలనుకున్నాడు. ఈ విషయంపై కోర్టుకి వెళ్లారు. కోర్టు కూడా ముందు ‘టూ స్టేట్స్’ సినిమా సంగతి చూడమని అడివి శేష్ తరఫు న్యాయవాదికి సూచించారట. శేష్ నుండి మరో సినిమా రిలీజ్ కావాలన్నా.. కొత్త సినిమా ఒప్పుకోవాలన్నా.. ‘టూ స్టేట్స్’ నిర్మాత నుండి నో అబ్జెక్ష‌న్ సర్టిఫికెట్ ను తీసుకోవాలి. మరి ఈ విషయాన్ని శేష్ ఎప్పుడు సెటిల్ చేసుకుంటాడో చూడాలి!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus