ముగ్గురు భామలతో రాహుల్ రొమాన్స్..!!

  • July 12, 2016 / 05:27 AM IST

మద్రాసీగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, టాలీవుడ్ లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నతమిళ  హీరో రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన ఈ యంగ్ హీరో అలా ఎలా, టైగర్, శ్రీమంతుడు చిత్రాల ద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏడాది గ్యాప్ తర్వాత “శోభన్ బాబు” అనే ఫిల్మ్ తో మనల్ని పలకరించడానికి రాబోతున్నాడు.

విప్లవ్ దర్శకత్వంలో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో రాహుల్ ముగ్గురి భామలతో రొమాన్స్ చేయనున్నారు. ఈ సంగతి ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. “శోభన్ బాబు సినిమాలో నేను విడాకులు విప్పించే లాయర్ పాత్రలో కనిపిస్తాను. ఈ క్రమంలో ముగ్గురు అందమైన అమ్మాయిలతో పరిచయం ప్రేమకు దారితీస్తుంది. వారిలో ఎవరిని సెలక్ట్ చేసుకోవాలో తెలియక తికమక పడుతూ మిమ్మలి నవ్విస్తాను” అని  రాహుల్ తెలిపారు.

ఇంతకీ ఆ పాత్రలు ఎవరు చేస్తున్నారని అడిగితే “పార్వతీ నాయిర్ (ఉత్తమ విలన్ ఫెమ్), నిత్యా శెట్టి (దాగుడుమూత దందా కోర్ ఫెమ్)లు ఒకే అయ్యారు. మూడో అమ్మాయి ఇంకా ఖరారు కాలేదు.” అని రాహుల్ వెల్లడించారు. ఇంకా ఇందులో వెన్నెల కిషోర్, రాహుల్ మధ్య వచ్చే సన్నివేశాలు భలే ఫన్నీ గా ఉంటాయని చిత్ర బృందం తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus