Siddharth: దర్శకుడు చేసిన పని వల్ల అంత మంది కంగారు పడ్డారు : సిద్దార్థ్

  • October 9, 2021 / 11:45 AM IST

మొన్నామధ్య హీరో సిద్దార్థ్ గాయాలు పాలయ్యాడని అతనికి సర్జరీ కూడా అయ్యింది అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అతను మహాసముద్రం సినిమా షూటింగ్ లో గాయపడడం వల్ల… సర్జరీ అయ్యింది.. అని దర్శకుడు అజయ్ భూపతి స్వయంగా చెప్పడంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఆ తర్వాత కూడా వరుసగా టాలీవుడ్ హీరోలు గాయాలు పలవ్వడంతో అందరిలో ఆందోళన నెలకొంది. కానీ సిద్దార్థ్ మాత్రం ఈ విషయంలో నిజం లేదు అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సిద్దార్థ్ మాట్లాడుతూ.. “నాకు సర్జరీ జరిగింది అని అందరూ కంగారు పడ్డారు. అయితే అందులో పూర్తిగా నిజం లేదు. దర్శకుడు అజయ్ భూపతి కి నా పై ప్రేమ ఎక్కువయ్యింది. మహాసముద్రం క్లైమాక్స్ షూటింగ్ లో నాకు చిన్న గాయమైంది. దానికి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్న టైంలో అజయ్ భూపతి నాకు కాల్ చేసాడు. ఆ టైంలో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా… మళ్లీ కాల్ చేస్తా అని చెప్పాను. దానికి అతను సర్జరీ అనుకుని అందరికీ చెప్పేశాడు. ఆ న్యూస్ వైరల్ అయిపోయింది.

మా అమ్మా నాన్న కూడా కంగారు పడిపోయారు. అదేంటి ఇలా చెప్పావ్ అని నేను అజయ్ ను అడిగితే..’ మీరే కదా ట్రీట్మెంట్ అన్నారు ‘ అన్నాడు. నేను ట్రీట్మెంట్ అన్నాను .. సర్జరీ కాదు అని అతనికి క్లారిటీ ఇచ్చాను. అంతే అంతకు మించి ఏమీ లేదు. నేను బాగానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus