ప్రభాస్ భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ కు బ్యూటీ సెట్ అయిపోయిందోచ్

  • November 30, 2020 / 09:25 PM IST

ప్రభాస్ సినిమాలు ఈమధ్య కనీసం నెలకొకటయినా కన్ఫర్మ్ అవ్వడం ఖాయం అయిపొయింది. ఆల్రెడీ రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ సినిమా, ఆది పురుష్ లతో యమా బిజీగా ఉన్న బాహుబలి.. ప్రశాంత్ నీల్ తో సినిమాను కూడా ఇంకొన్ని గంటల్లో అఫీషియల్ చేయనున్నాడు. అయితే.. ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ల కంటే సదరు సినిమాల విడుదల తేదీల విషయమే పెద్ద టెన్షన్ అనుకోండి అది వేరే విషయం. అంతకంటే పెద్ద టెన్షన్ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది.

సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేయడం అనేది ప్రభాస్ అభిమానులకు ఇప్పటికీ పెద్దగా మింగుడుపడలేదు. అయితే.. రాధేశ్యామ్ కు పూజా హెగ్డేతో సంతృప్తి చెందారు. ఇప్పుడు ఆది పురుష్ లో హీరోయిన్ ఎవరు అనే విషయంలోనూ టెన్షన్ మొదలైంది. అనుష్క శర్మ పేరు వినిపించినప్పటికీ.. ఆమెను ఫైనల్ చేసే అవకాశం లేదని తేలిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో కృతిసనన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ప్రభాస్ హైట్ కి ఆమె ఎగ్జాట్ గా సరిపోవడమే కాక.. సీత పాత్రకు కూడా నటిగా న్యాయం చేయగలదని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో “ఒన్ నేనొక్కడినే, దోచేయ్” చిత్రాల్లో నటించి ఆశించిన స్థాయి ఇమేజ్ ను అందుకోలేకపోయిన కృతి.. ఆదిపురుష్ తో టాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus