నందిని రెడ్డి వెంట పడుతున్న కథానాయకులు..!

  • March 28, 2016 / 08:23 AM IST

కళ్యాణవైభోగమే చిత్రంతో మంచి హిట్ ను అందుకోవడంతో.. ఇప్పుడు కుర్ర హీరోలు అందరూ కూడా డైరెక్టర్ నందిని వెంట పడుతున్నారట. ‘అలా మొదలైంది’ చిత్రంతో నానికి, కళ్యాణ వైభోగమే చిత్రంతో నాగశౌర్యకు మంచి హిట్ ఇవ్వడంతో.. తమకూ అదే తరహా హిట్లు కావాలని కుర్రహీరోలు నందిని రెడ్డి వెంట పడుతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ప్రస్తుతం నందిని రెడ్డి తన తదుపరి చిత్రం కోసం స్క్రిప్ట్ ను సిద్దం చేసుకుంటుండగా.. తన తదుపరి చిత్రం యొక్క వివరాలను మరో రెండు మూడు నెలల్లో వెల్లడించే అవకాశం ఉంది. కాగా నందిని రెడ్డి తెరకెక్కించిన కళ్యాణ వైభోగమే చిత్రంలో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించగా.. థియేటర్ లలో ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus