హేమ పై చర్యలు : ఇదో రకం ప్రమోషన్ : దళితులను తరిమేయాలి అంటూ నటి చెత్త వ్యాఖ్యలు

  • August 9, 2021 / 09:00 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటి హేమ తాజాగా సీనియర్ నరేష్ ‘మా’ నిధులలో మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ‘మా’ అసోసియేషన్ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పందించిన సీనియర్ నరేష్ హేమ వ్యాఖ్యలను తప్పబట్టడంతో పాటు హేమపై చర్యలు తీసుకుంటామని కామెంట్లు చేశారు. ‘మా’ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా హేమ కామెంట్లు చేశారని సీనియర్ నరేష్ చెప్పుకొచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సినిమాల ప్రచారం మొత్తం సోషల్‌ మీడియా మీదనే జరుగుతున్న రోజులివి. ఏ విషయం చెప్పాలన్నా, ఏ విషయం మీద క్లారిటీ ఇవ్వాలన్నా అందులోనే అన్నీ చేసేస్తున్నారు. ఆ సోషల్‌ మీడియా పేజీలను ఎవరు హ్యాండిల్‌ చేస్తారు, ఎవరు పోస్టులు పెడతారు అనేది పెద్దగా ఆసక్తి లేని అంశం. అయితే ఆ విషయంతో సినిమా ప్రచారం చేసుకోవచ్చా… రాజమౌళి టీమ్‌ చేస్తున్న పనిని చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉంది.అక్కడ చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరిస్తున్నారని సమాచారం. దీంతో సినిమా చిత్రీకరణ పూర్తయినట్లేనట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తమిళ నటి మీరా మిథున్ దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. దళితుల కారణంగానే కోలీవుడ్ లో మంచి సినిమాలు రావడం లేదని.. వారంతా కోలీవుడ్ నుండి బయటకు వెళ్లిపోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రీసెంట్ గా మీరా మిథున్ సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఒక డైరెక్టర్ ను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ డైరెక్టర్ తన ఫోటోను అనుమతి లేకుండా దొంగిలించి పబ్లిసిటీ కోసం వాడుకున్నాడని ఆవిడ ఆరోపించింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది రూపొందించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సీటీమార్’. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ఈ సినిమా నుండి జ్వాలా రెడ్డి అనే పాటను కూడా విడుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ కి ముందే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయింది. నైజాం ఏరియాను మంచి ఫ్యాన్సీ రేటుకి వరంగల్ శ్రీను తీసుకున్నారు. అలానే చాలా ప్రాంతాల్లో బిజినెస్ జరిగిపోయింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్ గా మారింది కృతిశెట్టి. దాంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టాయి. ఇటీవల ఆమె సరిగ్గా నటించడం లేదని.. ఓ దర్శకుడు మందలించాడని వార్తలు షికారు చేశాయి. అయితే ఈ విషయంలో నిజమెంత అనేదానిపై ఓ క్లారిటీ వచ్చింది. అసలేం జరిగిందంటే.. రామ్ పోతినేని హీరోగా దర్శకుడు లింగుస్వామి ఓ యాక్షన్ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కృతిశెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus