మరోసారి బాధకు లోనైన సునీత : కాజల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ : ఆచార్య ఆడియోకి 4 కోట్లు

  • February 4, 2021 / 08:19 PM IST

‘చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు స్వర్గస్థులయ్యారు. ఇలాంటి మహానీయుల్ని కోల్పోతుంటే.. చాలా బాధగా ఉంది’ అంటూ సింగర్ సునీత తన గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు మృతి పట్ల స్పందించారు. ఆయన ఈరోజున మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సునీత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మోసగాళ్ళు చిత్రం మార్చి 19న విడుదల కాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.ఈ చిత్రంలో విష్ణు సోదరిగా కాజల్ కనిపించనుంది. జెఫ్రే గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించాడు. నవదీప్, సునీల్ శెట్టి వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్,కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ ల పై నిరంజన్‌ రెడ్డి, రాంచరణ్ లు కలిసి ఈ చిత్రాన్ని‌ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు కొనుగోలు చేశారు.4 కోట్ల భారీ రేటుకి ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మే 13న విడుదల కాబోతుంది.


Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus