దుబాయ్ లో ‘సర్కారు వారి పాట’ : మళ్ళీ నిర్మాతగా మారనున్న పవన్ : కరోనా నుండీ కోలుకున్న చరణ్

  • January 12, 2021 / 07:26 PM IST

మహేష్ బాబు కథానాయకుడిగా పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్ జనవరి 25 నుండీ దుబాయ్‏లో ప్రారంభం కానుంది. దాదాపు 20 రోజుల పాటు అక్కడే ఈ షెడ్యూల్ ఉంటుందట. అటు తర్వాత రెండో షెడ్యూల్ ను హైదరాబాద్‏లో నిర్వహిస్తారని సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ అయిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పై మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించబోతున్నాడట. గతంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘ఛల్ మోహన్ రంగ’ వంటి సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ నిర్మించాడు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇటీవల కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ఎటువంటి లక్షణాలు లేకున్నా.. చరణ్ కరోనా టెస్ట్ చేయించుకోగా రిపోర్ట్స్ లో పాజిటివ్ అని వచ్చిందని చరణ్ తెలిపిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా హోమ్ క్వారంటైన్ లో ఉంటూ వచ్చిన చరణ్.. కరోనా నుండీ కోలుకున్నట్టు తాజాగా వెల్లడించాడు. తన గురించి ప్రార్ధించిన వారికందరికీ థాంక్స్ అంటూ చరణ్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

శ్రీకాంత్ హీరోగా కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘పెళ్ళి సందడి’ విడుదలయ్యి ఈరోజుతో 25ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ..”నేటికి ‘పెళ్ళి సందడి’ సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయ్యింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణి కి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus