చెన్నైకి బయలుదేరనున్న మహేష్ అభిమానులు!

  • September 8, 2017 / 06:36 AM IST

హద్దులంటూ లేనిదీ అభిమానం. తాము అభిమానించేవారు కోసం ఎంత దూరమైనా, ఎంతకష్టమైనా ఫ్యాన్స్ వెళ్లిపోతుంటారు. అందుకు నిదర్శనాలు ఇదివరకు ఎన్నో చూసాము. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ విషయంలో మరోసారి చూడనున్నాం. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో  సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న “స్పైడర్” మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి ముస్తాబవుతోంది. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. ఆయన స్వరపరిచిన పాటల్లో రెండు యూట్యూబ్ లో రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పూర్తి ఆల్బమ్ ని రేపు ( 9 వ తేదీ) చెన్నైలో నిర్వహించే వేడుకలో రిలీజ్ చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళంలో స్టార్ డైరక్టర్స్ గా పేరొందిన రాజమౌళి, శంకర్ హాజరుకానున్నట్లు తెలిసింది. తెలుగు, తమిళ వెర్షన్ ఆడియో సీడీలను వీరు లాంచ్ చేయనున్నారు. మహేష్ కోలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని ఈ ఈవెంట్ ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి 2000 మంది అభిమానులు చెన్నైకి తరలి వెళ్లనున్నారు. చప్పట్లతో సందడి చేయనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus