ఎవరు ఏమన్నా.. తగ్గే ప్రసక్తే లేదని చెప్పిన అనుపమ

  • April 10, 2017 / 11:59 AM IST

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తొలి చిత్రంతోనే తెలుగు వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ’ మూవీలో చిన్న రోల్ అయినప్పటికీ చక్కగా నటించి అభినందనలు అందుకుంది. అలాగే తనకు సూట్ అయ్యే రోల్స్ ఎంచుకుంటూ టాలీవుడ్ లో మంచి ట్రాక్ రికార్డ్ నే కలిగి ఉంది. ఆమె నటించిన  ‘ప్రేమమ్’, శతమానం భవతి హిట్ కావడంతో యువహీరోల చూపు ఆమె పై పడింది. తాజాగా శతమానం భవతి జాతీయ అవార్డు పొందింది. ఈ సందర్భంగా అనుపమ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.  ‘మలయాళంలో నా తొలి సినిమా ‘ప్రేమమ్‌’. ఆ సినిమా ప్రమోషన్‌లో చురుగ్గా పాల్గొన్నాను. అడిగిన వారందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చాను. అప్పుడు నన్ను చూసి ‘ఈ పిల్ల అతి చేస్తోంది’ అని కొందరు కామెంట్ చేశారు.

ఆ కామెంట్స్‌ నన్ను బాధపెట్టలేదు. నేను తప్పు చేయనప్పుడు బాధపడటమెందుకు?, నన్ను నమ్మి దర్శకనిర్మాతలు నటించే అవకాశం ఇచ్చారు. సినిమాకు సపోర్ట్‌ చేయడంలో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చాను. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను. ఇక్కడ కూడా ప్రమోషన్లలో తప్పకుండా పాల్గొంటాను. ఎవరు ఏమనుకున్నా నా సినిమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’ అని చెప్పుకొచ్చింది. ఇలా ప్రతి హీరోయిన్ అనుకుంటే నిర్మాతలకు ఎంతో కొంత మేలు చేసిన వారవుతారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus