ఆగలేక పోతున్నా : ప్రగ్యా జైస్వాల్

  • August 22, 2016 / 02:07 PM IST

‘కంచె’ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో నటించి అందరి మనసులను గెలుచుకున్న నటి ప్రగ్యా జైస్వాల్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో పని చేయాలని కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సందీప్ కిషన్, రెజీనా హీరో, హీరోయిన్లుగా కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న‘నక్షత్రం’ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రగ్యా కనిపించనుంది.

ఇందులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ హీరో తో కలిసి ప్రగ్యా సాహసాలు చేయనుంది. “నా కెరీర్ లో ఈ రోల్ గుర్తుండి పోతుంది. నాకు రెండు యాక్షన్ సీక్వెన్స్ లు ఉండడం ఎంతో ఉత్సహాన్ని ఇస్తోంది. ఎప్పుడెప్పుడు షూటింగ్ జరుగుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నా” అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. అంతేకాదు మరో ఆసక్తికర విషయాన్నీ వెల్లడించింది. “నేను ఐదుసంవత్సరాల పాటు కరాటే నేర్చుకున్నాను. బ్లాక్ బెల్ట్ సాధించాను. అప్పుడు నేర్చుకున్న విద్య ఇప్పుడు ఉపయోగ పడుతోంది. నా పత్రిభను చూపించడానికి అవకాశం వచ్చింది.

అందుకే చిత్రీకరణ వరకు ఆగలేక పోతున్నా” అని ప్రగ్యా వివరించింది. కంచె లో ఎంతో సుకుమారంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ‘నక్షత్రం’ లో చాలా హార్డ్ గా కనిపించనుందన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus