కన్నడ ఇండస్ట్రీ పై… పంజా విసిరిన ఐటీ అధికారులు..!

  • January 3, 2019 / 11:42 AM IST

తాజాగా కన్నడ చిత్ర సీమకు చెందిన .. పునీత్‌ రాజ్‌కుమార్‌, శివకుమార్, కిచ్చా సుదీప్, కేజీఎఫ్ స్టార్ యశ్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నివసాల్లో ఇళ్ళ పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నాటక సీఎం కుమారస్వామి భార్య అలాగే సినీ నటి రాధిక ఇళ్ళలో కూడా తనిఖీలు నిర్వహించడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఒక్క బెంగళూరులో ఏకకాలంలోనే 60 చోట్ల వారకూ ఐటీ దాడులు జరిగినట్టు తెలుస్తుంది. బెంగళూరులోని సదాశివనగర్‌లో పునీత్‌ రాజ్‌కుమార్‌ నివాసంతో సహా.. మన్యతా టెక్‌ పార్క్‌లోని తన సోదరుడు శివరాజ్‌కుమార్‌కు చెందిన ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతుండడం గమనార్హం. ఇక ఇప్పటి వరకూ.. నటీనటుల ఇళ్ళతో సహా ఆఫీసులు.. మొత్తం 25 చోట్ల ఐటీ రైడ్ లు జరిపినట్టు తెలుస్తోంది.

తెలుగులో రవితేజతో ‘పవర్’ అలాగే ‘ఆట గ‌ద‌రా శివ’ వంటి చిత్రాలు నిర్మించిన రాక్‌లైన్‌ వెంకటేష్ తో సహా.. ఇంకా కొందరు నిర్మాతలైన జయన్న అలాగే ఈ మధ్య ‘కే.జీ.ఎఫ్‌’ వంటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ నివాసాల్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ స్టార్లందరూ పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లించకుండా తప్పించుకున్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు వార్తలంతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus