తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పిన తారక్

  • November 30, 2016 / 09:13 AM IST

నందమూరి హరికృష్ణ కొడుకులైన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కొంత కాలంగా అనుబంధం బలపడింది. అన్న స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఒక సినిమా చేస్తానని తారక్ ఏడాది క్రితం చెప్పారు. ఆ బ్యానర్లో వచ్చిన కిక్ 2 , ఇజం సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. దీంతో కళ్యాణ్ రామ్ నష్టాల పాలయ్యారు. ఆ బ్యానర్ కి గుడ్ విల్ కూడా దెబ్బతింది. ప్రస్తుతం ఆ బ్యానర్లో చేయాలంటే స్టార్ హీరోలు కొంత ఆలోచిస్తారు.  వరుస హిట్లతో దూసుకు పోతున్న ఎన్టీఆర్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ సంస్థలో హిట్ మూవీ చేసి అన్నను నష్టాల నుంచి బయట పడేయడమే కాకుండా, తాత పేరుమీదున్న బ్యానర్ కి గుడ్ విల్ పెంచాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకే మంచి కథ కోసం మూడు నెలలుగా అన్వేషిస్తున్నట్లు తెలిసింది.

పక్కా హిట్ అవుతుందని అనిపించినప్పుడే ఆ స్క్రిప్ట్ తో మూవీ చేయడానికి డిసైడ్ అయ్యారు. పెద్ద దర్శకులు చెప్పిన కథలు నచ్చినా అది స్క్రిప్ట్ దశలో ఆకట్టుకోలేక పోవడంతో మొహమాటం లేకుండా పక్కన పెట్టారు. ఇప్పుడు పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలను తీసిన బాబీ చెప్పిన కథ తారక్ కి భలే నచ్చింది. దీంతో అతనికి కండిషన్ మీద మాట ఇచ్చారు. బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తి అయినా తర్వాత, అది నచ్చిన తర్వాతే సినిమా చేస్తానని చెప్పారంట. వచ్చిన అవకాసాన్ని వదులుకోకూడదని బాబీ కొంతమంది రచయితల సహాయంతో స్క్రిప్ట్ ని గొప్పగా రాస్తున్నట్లు సమాచారం. అది గానీ ఒకే అయితే అన్న బ్యానర్లో సినిమా ప్రారంభం అవుతుంది. ఈ కథ కాకపోయినా ఏ స్క్రిప్ట్ తనకు నచ్చినా అది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోనే ఉంటుందని దర్శకులకు తారక్ చెబుతుండడం విశేషం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus