కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకల్లో సందడి చేసిన విజయ్ దేవరకొండ..!

  • May 26, 2022 / 01:23 PM IST

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, దర్శకుడు అయిన కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు వేడుకని ముంబైలోని తన సొంత నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. మే 25న కరణ్ జోహార్ 50 వ పుట్టిన రోజు వేడుక జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ హీరోల్లో ఒక్క విజయ్ దేవరకొండ కు మాత్రమే ఆహ్వానం వెళ్ళింది. రష్మిక కి కూడా ఆహ్వానం అందింది అంటూ ప్రచారం జరిగింది కానీ ఆమె వెళ్లిందా లేదా అన్న విషయాలు అయితే బయటకి రాలేదు. ఇదిలా ఉండగా..

టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మందికి కరణ్ జోహార్ క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. కానీ వాళ్ళెవరికీ కరణ్ బర్త్ డే పార్టీకి ఆహ్వానం అందలేదు. ఒక్క విజయ్ దేవరకొండకి మాత్రమే ఆహ్వానం అందింది. ఇందుకు కారణాలు లేకపోలేదు.. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి పూరి, ఛార్మీలతో పాటు కరణ్ జోహార్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

బాలీవుడ్లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్లో ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే అతన్ని బాలీవుడ్లో లాంచ్ చేసే బాధ్యత ని కరణ్ జోహార్ తీసుకున్నాడు. విజయ్ దేవరకొండతో పాటు పూరి జగన్నాథ్, ఛార్మీ లు కూడా ఈ పార్టీకి హాజరైనట్టు తెలుస్తుంది.ఈ పార్టీకి చాలా మంది బాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం మన విజయ్ దేవరకొండ అనే చెప్పాలి..!

ఇక ‘లైగర్’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో విజయ్ కు జోడీగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్ కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నటుడిగా అతను చేస్తున్న మొదటి చిత్రం ఇది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus