ప్రభాస్ 19 మూవీలో ఫ్యాన్స్ ని ఊరించే అంశాలు

  • February 13, 2017 / 11:14 AM IST

యువ దర్శకుడు సుజీత్ కల ఫలించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీయాలనే కోరికకు ఈ రోజు తొలి అడుగుపడింది. వీరి కాంబినేషన్లో సినిమా నేడు లాంఛనంగా ప్రారంభమయింది. ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కి కారణాలు అనేకం ఉన్నాయి.. వాటిలో మొదటిది  ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడం. ఇది వరకు డార్లింగ్ ఎప్పుడూ పోలీస్ పాత్ర చేయలేదు. భారీ కటౌట్ కలిగిన ప్రభాస్ పోలీస్ డ్రస్ వేస్తే ఆ యూనిఫామ్ కే కొత్త పవర్ రావడం గ్యారంటీ. ఇక రెండో అంశం బ్యానర్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ మిర్చి సినిమా తీశారు. ఈ మూవీ అతని కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నారు. 150 కోట్లతో నిర్మితం కానున్న ఈ సినిమా బాహుబలి తర్వాత రెబల్ స్టార్ కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. ప్రచారానికి దూరంగా పనికి దగ్గరగా ఉండే టెక్నీషియన్ మధి. ఈయన ‘మిర్చి, శ్రీమంతుడు, ఘాజి’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఇప్పుడు ప్రభాస్ 19 కి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ అంశం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి బూస్ట్ ని ఇస్తోంది. ఒక సారి జాతీయ అవార్డు అందుకోవడమే గ్రేట్. అటువంటిది నాలుగు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఈ సినిమా టీమ్లో ఉన్నారు. ఇక ఖర్చు పెట్టే ప్రతి పైసా వెండితెరపైన కనిపించాల్సిందే. డార్లింగ్ అభిమానుల్ని ఊరిస్తోన్న మరో అంశం సంగీత త్రయం.  జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న వీరు గతంలో “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” సంగీతం అందించారు. ఇప్పుడు ప్రిన్స్ సినిమాకోసం ప్రాణం పోయనున్నారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే  ప్రభాస్ 19 మూవీ క్రేజీ ప్రాజక్ట్ అయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus