Mythri Movie Makers: ఇప్పుడు బిజినెస్‌ మొదలెట్టుంటే ఓ లెవల్!

  • June 27, 2021 / 09:55 PM IST

టాలీవుడ్‌లో భారీ సినిమాలు, పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు, అడ్వాన్స్‌ బుకింగ్‌, అంతకుమించి సినిమా బిజినెస్‌లకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారుతోంది మైత్రి మూవీ మేకర్స్‌. ఇప్పుడు ‘పుష్ప’తో పాన్‌ ఇండియా మూవీని తీస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో మైత్రి టీమ్‌ తొందరపడిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. సినిమా విడుదల సమయం వచ్చేంతవరకు ఆగుంటే బాగుండేది అంటున్నారు. ‘పుష్ప’ సినిమాను 2019లో ప్రకటించారు. అప్పటి నుండి సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

అయితే ప్యారలల్‌గా సినిమా బిజినెస్‌ పనులు కూడా పూర్తి చేశారట. అదే ఇప్పుడు సమస్యగా మారిందంటున్నాయి టాలీవుడ్ మార్కెట్‌ వర్గాలు. సినిమా అనౌన్స్‌ చేసిన సమయంలో థియేట్రికల్‌ రైట్స్‌ను మైత్రి టీమ్‌ ₹60 కోట్లు – ₹65 కోట్లకు అమ్మేసింది. అదే ఇప్పుడు ఈ డీల్‌ జరిగి ఉంటే మరో ₹30 కోట్ల నుండి – ₹35 కోట్ల వరకు వచ్చి ఉండేదని అంటున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్‌ అప్పుడు ఉన్న బజ్‌కు, ఇప్పుడున్న బజ్‌కు తేడా చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది.

ఐఎండీబీ వెలువరించిన ఎక్కువమంది వెయిట్‌ చేస్తున్న సినిమాల లిస్ట్‌లో ‘పుష్ప’ ఇప్పుడు తొలి స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ బిజినెస్‌ మాటలు బయటకు వచ్చాయి. అయితే అప్పుడైన డీల్‌ను ఇప్పుడు మళ్లీ మార్చలేరు కాబట్టి. వేరే ఇంకేదైనా ఛానల్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించాలి మరి.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus