తొలి బయోపిక్‌కే వామ్మో అంటున్న ‘బ్లాక్‌ రోజ్‌’

  • January 21, 2021 / 04:43 PM IST

బయోపిక్స్‌లో నటించడం అంత సులభం అని ఎవరూ అనరు.. అయితే ఆ మాట ప్రధాన పాత్రధారి చెబితే బాగుంటుంది. అంతేకానీ ఆ పాత్రధారి భార్యగా నటిస్తున్న వ్యక్తి చెబితే ఏమో అంతగా బాగోదు అనిపిస్తుంటుంది. ఒకవేళ ఆ మాట చెప్పాలంటే ఆ రెండు పాత్రలు నిజ జీవితం నుంచి పూర్తిగా తీసుకున్నవి అయి ఉండాలి. బాలీవుడ్‌ భామ, త్వరలో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న ‘బ్లాక్‌ రోజ్‌’ ఊర్వశి రౌటేలా ఇప్పడు అదే మాట అంటోంది. ప్రస్తుతం ఊర్వశి ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఓ సూపర్‌ కాప్‌ జీవితం ఆధారంగా ‘ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌’ అనే సిరీస్‌ తెరకెక్కుతోంది. ఇందులో అవినాష్‌ భార్య పూనమ్‌ మిశ్రా పాత్రలో ఊర్వశి కనిపించబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన పాత్ర గురించి, దానికి పడుతున్న కష్టం గురించి చెప్పుకొచ్చింది. నిజ జీవిత పాత్రల్లో నటించడం అంత సులభం కాదు. బయోపిక్స్‌ చేయడం అంటే సవాలే. వేరొకరి కథను పోషించడం చాలా పెద్ద బాధ్యత. వారి వ్యక్తిత్వాన్ని తెరపైకి తీసుకురావడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది ఊర్వశి.

“నిజజీవితంలోని ఓ వ్యక్తి పేర్రణతో… పూనమ్ మిశ్రా అనే పాత్ర చేస్తున్నాను. బయోపిక్స్​లో నటించడమంటే ఆషామాషీ కాదు. ఈ పాత్ర గురించి పూర్తిగా తెలుసుకోవడానికి పూనమ్​తో చర్చిస్తున్నాను. ఆమె వ్యక్తిత్వం, వేషధారణ, ప్రవర్తనకు నా నటన దగ్గరగా ఉండేలా ప్రయత్నిస్తాను” అని ఊర్వశి చెప్పుకొచ్చింది. ఊర్వశి ఇంతగా చెబుతోందటే.. ఆ పాత్ర కూడా బలంగా ఉంటుందేమో. చూద్దాం వెబ్‌సిరీస్‌ను త్వరలోనే తీసుకొస్తారని వార్తలొస్తున్నాయి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus