గౌతమి పుత్ర శాతకర్ణి నిర్మాతల ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారుల దాడులు
January 31, 2017 / 12:41 PM IST
|Follow Us
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శాతవాహనుల చరిత్రతో క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాలయ్య వందో చిత్రం రిలీజ్ అయిన అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికే 90 కోట్లకు పైన గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను రాయితీ ని ప్రకటించడంతో నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయి బాబులకు పెద్దమొత్తంలో షేర్ వచ్చినట్లు టాక్.
చిత్ర యూనిట్ కలక్షన్స్ పై ఎక్కడా మాట్లాడ పోయినప్పటికీ చిత్రానికి లభిస్తున్న ఆదరణ తెలుసుకున్నఐటీ అధికారులు రాజీవ్ రెడ్డి, సాయి బాబు ఇళ్లపై నేడు దాడి చేశారు. నిర్మాతల తో పాటు నైజాం పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. దీంతో శాతకర్ణి మరోమారు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.