మరో స్టార్ హీరోని టార్గెట్ చేసిన ఐటీ అధికారులు..!

  • February 5, 2020 / 08:10 PM IST

గత కొంత కాలంగా ఐటీ అధికారులు సౌత్ లో ఉన్న హీరోలందరినీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో మహేష్ బాబు దగ్గర్నుండీ మొదలుపెడితే నాని లాంటి టైర్ 2 హీరోలను కూడా విడిచి పెట్టలేదు. అక్కడితో ఆగలేదు రష్మిక మందన వంటి క్రేజీ హీరోయిన్ తో పాటు సుమ, అనసూయ వంటి స్టార్ యాంకర్లను కూడా విడిచిపెట్టలేదు. ఇక మిగిలిన భాషల్లో హీరో యష్, పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలను కూడా టార్గెట్ చేశారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో అయిన విజయ్ ను కూడా ఐటీ అధికారులు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈమధ్యనే కోలీవుడ్ సినీ ప్రముఖుల్లో కొంత మంది ఇళ్ళ పై ఐటీ అధికారులు రైడ్ లు జరుపుతున్న క్రమంలో.. స్టార్ హీరో విజయ్ ను కూడా వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. షూటింగ్ లో ఉన్న టైంలోనే.. విజయ్ ని కలిసి ఏకంగా 5 గంటల పాటు విచారించారట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. విజయ్ తో పాటు ‘బిగిల్’ నిర్మాణ సంస్థ అయిన ‘ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్’ పై కూడా అధికారులు దాడులు చేసినట్టు సమాచారం. సరిగ్గా టాక్సులు చెల్లించకపోవడం వల్లే ఇలా వారు రైడ్ చేశారేమో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus