ఆ విషయంలో నేను మోసపోయాను : ఐశ్వర్య రాజేష్

  • May 21, 2019 / 11:22 AM IST

కోలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించి క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది ఐశ్వర్య రాజేష్. బుల్లి తెరపై యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్న ఐశ్వర్య.. అతి త్వరలో విజయ్ దేవరకొండ సరసన నటించడానికి రెడీ అవుతోంది. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో ఐశ్వర్య రాజేష్ ఓ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా…గతంలో ఈమె విక్రమ్ తో చేసిన ‘సామి 2’ చిత్రం తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ముందుగా ఈ చిత్రంలో నటించాలి అని అనుకోలేదంట. కానీ తన సన్నిహితుల బలవంతం ఒప్పుకుందట. అయితే దర్శకుడు హరి ముందు కథ చెప్పినట్టుగా ఆ తరవాత తనకు సినిమాలో ప్రాధాన్యం లేదని ఈ విషయంలో తనకు ఇప్పటీ సంతృప్తిగా లేదని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో దర్శకుడి చేతిలో మోసపోయానని మరో సారి ఇలా జరగకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నానని తన బాధను వ్యక్తం చేసింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus