మొదలైన జగదేక వీరుడు.. అతిలోక సుందరి సీక్వెల్ వర్క్!

  • September 12, 2016 / 01:06 PM IST

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు  వెండి తెరపై రాసిన దృశ్య కావ్యం జగదేక వీరుడు.. అతిలోక సుందరి. ఇందులో అతిలోకసుందరిగా శ్రీదేవి, జగదేక వీరుడుగా మెగాస్టార్ చిరంజీవి నటించి మెప్పించారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించిన ఈ మూవీ కోట్లు కురిపించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని నిర్మాత ఎప్పటినుంచో అనుకుంటున్నారు. హీరోగా రామ్ చరణ్ తేజ్ అనుకోని కథను ప్లాన్ చేశారు. కొన్నేళ్ల క్రితం ఇది పట్టాలెక్కనుందనే వార్తలు కూడా వచ్చింది. మెగా అభిమానులు సంబర పడిపోయారు. కానీ ఈ చిత్రం  ముందుకు కదలలేదు. కె. రాఘవేంద్ర రావు కూడా ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశపడుతున్నారు.

కానీ నేటి ప్రేక్షకులను మెప్పించాలంటే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కరక్ట్ అని అశ్వినీదత్ భావిస్తున్నారు. జక్కన్నను ఒప్పించేందుకు నిర్మాత ప్రయత్నిస్తున్నారు. అయన కాదంటే మరో దర్శకునితో నిర్మించేందుకు అశ్వినీదత్ సంకల్పంతో ఉన్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ తేజ్, ఈ చిత్రం తర్వాత సుకుమార్ డైరక్షన్లో నటించనున్నారు. దాని తర్వాత  “జగదేక వీరుడు.. అతిలోక సుందరి” స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొననున్నట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. అంతా సక్రమంగా సాగితే జగదేకవీరుడు – 2 వచ్చే ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని వివరించారు. అయితే మెగా ఫ్యాన్స్ కల త్వరలో నెరవేరనున్నదన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus