‘ప్రేమించుకుందాం రా’ కి ముందు వెంకీ ఆ సినిమా స్టార్ట్ చేసి ఆపేశారట!

  • May 11, 2022 / 06:20 PM IST

వెంకటేష్ హీరోగా అంజలా జవేరి హీరోయిన్ గా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1997 వ సంవత్సరం మే 9న ఈ చిత్రం విడుదలైంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఫ్యాక్షన్ కథకి ప్రేమ కథని అతికించి తీసిన ఈ మూవీ అప్పటి యూత్ ను బాగా ఆకట్టుకుంది.

ఈ చిత్రం రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తి కావస్తున్న తరుణంలో దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి ఈ మూవీ గురించి ఎవ్వరికీ తెలియని బోలెడన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. నిజానికి అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ వచ్చిన జయంత్.. ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. అయితే ఈ చిత్రానికంటే ముందుగా జయంత్.. వెంకటేష్ తో ఓ సినిమాని మొదలుపెట్టాడు.

ఆ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. వెంకటేష్ తో పాటు ఈ మూవీలో సౌందర్య, మాలాశ్రీ, వాణి విశ్వనాథ్ వంటి ముగ్గురు హీరోయిన్లు నటించాల్సి ఉంది. మాలాశ్రీతో పాటు కొందరు కమెడియన్స్ తో కలిపి కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిపారట. కానీ అందులో ప్రేమ కథని బలవంతంగా ఇరికించినట్టు ఉంది అని భావించి సురేష్ బాబు.. జయంత్ ను కూర్చోబెట్టి సినిమా ఆపేద్దాం వర్కౌట్ అవ్వదు అని చెప్పారట.

దీంతో దీన్ రాజ్ వద్ద ఉన్న ప్రేమ కథని ‘ప్రేమించుకుందాం రా’ గా తెరకెక్కించినట్లు జయంత్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా రిలీజ్ రోజుకి ముందు జయంత్ ను సురేష్ బాబు… తిరుపతికి తీసుకెళ్ళి అక్కడి నుంచి విజయవాడకి తీసుకెళ్ళి… అక్కడ ఓ థియేటర్లో ‘ప్రేమించుకుందాం రా’ సినిమాని చూపించిన సంగతిని కూడా జయంత్ గుర్తుచేసుకున్నాడు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus