కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సినిమా జోనర్ ఫిక్స్!
May 30, 2018 / 07:28 AM IST
|Follow Us
నిజజీవితంలో డాక్టర్, పోలీస్, లాయర్ లేదా కలెక్టర్ వంటివి అవ్వాలని కోరుకున్నవాళ్లు ఎప్పుడైనా సినిమాలో సదరు పాత్ర పోషించడానికి అవకాశం లభిస్తే ఎగిరి గంతులేస్తారు. రియల్ లైఫ్ లో కుద్రకపోయినా.. కనీసం రీల్ లైఫ్ లో అయినా అది సాధ్యపడుతున్నందుకు ఆనందపడతారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కూడా ఆ ఆనందపరవశంలో మునిగితేలుస్తున్నాడు. అందుకు కారణం తాను కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించనున్న చిత్రం ఫాదర్ సెంటిమెంట్ నేపధ్యంలో తెరకెక్కనుండడమే. నిజజీవితంలో సాయిధరమ్ తేజ్ తండ్రి ప్రేమను చూరగొనలేదు. అందుకు కారణం చిన్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోవడం.
అందుకే కిషోర్ తిరుమల కథ చెప్పినవెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా సైన్ చేసేశాడట సాయిధరమ్. ఇకపోతే.. తేజ్ బాబు నటించిన “తేజ్ ఐ లవ్ యూ” జూన్ 29న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈలోపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోయే సినిమాలోనూ నటించనున్నాడు సాయిధరమ్ తేజ్.