Jordar Sujatha: హాట్ టాపిక్ గా మారిన జోర్దార్ సుజాత సీమంతం ఫోటో.!

  • April 5, 2024 / 11:31 AM IST

శృతి అలియాస్ జోర్దార్ సుజాత అందరికీ సుపరిచితమే. వరంగల్ ప్రాంతానికి చెందిన ఈమె.. డిగ్రీ పూర్తి చేసి.. హైదరాబాద్ వచ్చింది. తర్వాత చిన్నా చితకా ఉద్యోగాలు చేసి.. ఆ తర్వాత ఓ న్యూస్ ఛానల్ లో తన స్లాంగ్ లో వార్తలు చదివేది. తెలంగాణ యాస పై ఆమెకు మంచి పట్టు ఉంది. అందుకే మరో న్యూస్ ఛానల్లో ‘జోర్దార్’ అనే షో చేసింది. అది ఈమెకు మరింత మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.ఆ షో వల్లనే ఈమె జోర్దార్ సుజాత అయ్యింది.

ఇక 2020 లో ఈమె ‘బిగ్ బాస్ 4 ‘ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ షో తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి వీడియోలు చేస్తూ వస్తోంది. అలాగే ఇంకోపక్క ‘జబర్దస్త్’ కామెడీ షోలో కూడా ఛాన్సులు దక్కించుకుంది. అదే టైంలో రాకింగ్ రాకేష్ తో ప్రేమలో పడటం.. కొన్నాళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇటీవల ‘జోర్దార్’ సుజాత.. ‘సేవ్ ది టైగర్స్ 2’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇదిలా ఉండగా.. ‘జోర్దార్’ సుజాత లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇందులో ఆమెకు సీమంతం జరిగినట్లు ఉంది. సుజాత ప్రెగ్నెంట్ అంటూ ఇటీవల వార్తలు వచ్చింది అంటూ ఏమీ లేదు. పైగా ఈ ఫోటోలు షేర్ చేసింది గెటప్ శీను భార్య. ఆమె తన సుజిశ్రీన్ కలెక్షన్స్ లో ‘హ్యాపీ ఫర్ యూ.. కంగ్రాట్యులేషన్స్’ అంటూ కామెంట్ పెట్టి ఈ ఫోటోని షేర్ చేసింది. దీంతో ‘జోర్దార్’ సుజాత నిజంగా ప్రెగ్నెంట్ అంటూ అంతా కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus