సావిత్రి బయోపిక్ లో సీనియర్ ఎన్టీఆర్ గా తారక్

  • June 22, 2017 / 08:04 AM IST

తెలుగువారు గర్వించే నటి సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. సావిత్రిగా కీర్తిసురేష్ నటిస్తుండగా, సమంత కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో సావిత్రి జీవితంలో అటు వ్యక్తిగతంగానూ, ఇటు వృత్తి పరంగానూ చోటు చేసుకున్న వివిధ సంఘటనలను నాగ్ అశ్విన్ చూపించనున్నారు. సావిత్రి సినీ కెరీర్ కి సంబంధించి ఆమె అప్పటి అగ్ర కథానాయకులందరితోనూ నటించారు. దీంతో ఆయా పాత్రలను ఇప్పుడు ఎవరెవరు పోషిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. జెమినీ గణేషన్ పాత్రకు యువ నటుడు దుల్కర్ సల్మాన్ ను చిత్ర బృందం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

‘మిస్సమ్మ’, ‘గుండమ్మ కథ’ వంటి ఎన్నో చిత్రాల్లో సావిత్రి, ఎన్టీఆర్ తో కలిసి నటించింది. ఆ మహానుభావుడి పాత్రలో ఆయన మనవుడు ఎన్టీఆర్ ని నటింపచేయించాలని చిత్ర బృందం అనుకుంటోంది. సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. తారక్ ఒప్పుకుంటే ఈ సినిమాకి భారీతనం వచ్చేస్తుంది. అలనాటి ఎన్టీఆర్ గా నేటి ఎన్టీఆర్ ని చూసుకోవాలనే వారి కల నెరవేరాలని కోరుకుందాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus