మొదటి సినిమాకి ఎన్టీఆర్ తీసుకున్న పారితోషికం?

  • May 22, 2020 / 12:40 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అంతకు ముందే బాలనటుడుగా పరిచయమైన సంగతి తెలిసిందే. గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రాన్ని ‘శబ్దాలయ థియేటర్స్’ బ్యానర్ పై ఎం.ఎస్.రెడ్డి నిర్మించారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గారి ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కు ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు 25 కోట్ల వరకూ పారితోషికం అందుకుంటూ ఎంతో బిజీగా ఉండే ఎన్టీఆర్..

తన మొదటి చిత్రానికి ఎంత పారితోషికం అందుకున్నాడు అనే విషయం తెలుసుకోవాలని .. ఎన్టీఆర్ అభిమానులతో పాటు మిగిలిన ప్రేక్షకులకు కూడా ఆసక్తిగా ఉంటుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ ‘బాలరామాయణం’ చిత్రానికి గానూ 4 లక్షలు పారితోషికం అందుకున్నాడట. తన మొదటి సంపాదనను ఎన్టీఆర్.. తన తల్లి షాలిని కి ఇచ్చాడట. నీకు నచ్చిన వస్తువుని ఈ డబ్బుతో కొనుక్కోమని ఆ టైములో ఎన్టీఆర్ తన తల్లికి చెప్పాడట.

అందుకు ఆమె ఎంతో మురిసిపోయిందట. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్నట్టు ఇది వరకే ప్రకటన వచ్చింది. తాజాగా ఎన్టీఆర్.. ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఓ చిత్రం చేస్తున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. ఈ విషయం పై దర్శకుడు ప్రశాంత్ నీల్ నిన్న ఇండైరెక్ట్ గా స్పందించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus