ఒక్క ఎన్టీఆర్ మాత్రమే రెండు సినిమాలతో రానున్నాడు?

  • April 11, 2020 / 08:50 PM IST

2020 సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోవడంతో ఆరంభం బాగుంది ఈ ఏడాది టాలీవుడ్ కి సినిమాల పండగే అనుకున్నారంతా. ఐతే కరోనా రూపంలో సినిమా పరిశ్రమకు మంచి దెబ్బే పడింది. పూర్తయిన సినిమా విడుదల, కొత్త సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ కారణంగా 2020మరియు 2021లో సినిమాల సంఖ్య తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సమీప కాలంలో సాధారణ పరిస్థితులు ఏర్పడితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు తమ చిత్రాల మిగతా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే యోచనలో ఉన్నారు.

బన్నీ సుకుమార్ తో చేస్తున్న మూవీ 2021కి వాయిదా వేశారు. కాబట్టి బన్నీ నుండి 2021లో రెండో సినిమా ఉండక పోవచ్చు. ప్రభాస్ మూవీ జాన్ ఈ ఏడాది చివర్లో లేదా 2021 ప్రారంభంలో విడుదల కావచ్చు. మహేష్ ఇంత వరకు అసలు సినిమానే ఒప్పుకోలేదు. ఒకవేళ కమిటైనా దాని విడుదల 2021లోనే ఉంటుంది. మహేష్ నుండి కూడా ఆ ఏడాది ఒక సినిమానే వచ్చే అవకాశం ఉంది.

పవన్ నుండి ఈ ఏడాది వకీల్ సాబ్ విడుదల కానుండగా, వచ్చే ఏడాది క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా విడుదల అవుతుంది. ఇక చరణ్ ఆర్ ఆర్ ఆర్ తరువాత చేసే మూవీ ఫిక్స్ చేయలేదు. ఒక్క ఎన్టీఆర్ మాత్రం పక్కాగా 2021లో ఆర్ ఆర్ ఆర్ తో పాటు, త్రివిక్రమ్ మూవీ విడుదల చేయనున్నాడు. మిగతా స్టార్ హీరోలు 2021లో మరో సినిమా విడుదల చేసే అవకాశాలు చాల తక్కువగా ఉన్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!     

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus