సగం అయిపోయిన ఎన్టీఆర్

  • January 12, 2018 / 03:39 PM IST

జై లవకుశలో జై పాత్ర ధారి నలుగురిని కొట్టాలి కాబట్టి ఎన్టీఆర్ దిట్టంగా ఉంటారు. కాలేజీ యువకుడి పాత్రలో లీనమై పోవాలంటే.. చాలా స్లిమ్ గా ఉండాలి. ఈ సమయంలో కాలేజీ పాత్రలా? నేను చేయను.. అని కొట్టి పడేయవచ్చు. కానీ అభిమానులకు కొత్త అనుభూతిని పంచడానికి ఎన్టీఆర్ కష్టపడుతున్నారు. జై లవకుశ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఫ్యామిలీ కథ. పైగా మంచి లవ్ స్టోరీ ఉంటుంది. అందుకు స్లిమ్ గా ఉంటే బాగుంటుందని డైరక్టర్ చెప్పగానే.. ఆ పనిలోకి దిగిపోయారు. ఇందుకోసం ముంబయి న్యూట్రిషన్ తో సలహాలు తీసుకొని, నిపుణులు చెప్పినట్లుగా డైట్ ఫాలో అవుతున్నారు.

అంతేకాదు చాలా గ్లామర్ గా కనిపించడానికి విదేశీ స్టైలిష్ ని నియమించుకున్నారు. నెల రోజులుగా పడ్డ శ్రమకి ఫలితం దక్కినట్లు.. ఎన్టీఆర్ ని చూసినవారు చెబుతున్నారు. చాలా మారిపోయారని సమాచారం. ఎన్టీఆర్ సగం అయిపోయారంట. ఈ న్యూస్ ఎన్టీఆర్ అభిమానులను సంతోషపెడుతోంది. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని చూద్దామా? అని ఉన్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్నఎన్టీఆర్ 28 వ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎన్టీఆర్ కొత్త లుక్ చూడాలనుకునేవారు అప్పటి వరకు ఆగాల్సిందే. తొలిసారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus